Newsచదువు

ఇంటర్‌ విద్యార్థులకు సర్కార్‌ న్యూఇయర్ గిఫ్ట్.. జనవరి 1 నుంచి కొత్త పథకం అమలుకు ప్రభుత్వం ప్లానింగ్‌!

Andhra Pradesh Government : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ సిద్ధం చేసింది. వివరాల్లోకెళ్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara Lokesh) అధికారులకు దిశానిర్దేశం చెసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. రేపు (డిసెంబర్‌ 19) జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు.. మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు 1st, 2nd Year షెడ్యూల్‌ విడుదల చేసింది. అలాగే.. ఏపీ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ (AP 10th Public Exams Schedule 2025) కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. కష్టపడి చదివి మంచి స్కోర్‌ చేయాలని ఆకాంక్షించారు.

ఇంటర్మీడియట్‌ విద్యా మండలి పునర్‌ వ్యవస్థీకరణ- ప్రభుత్వం ఉత్తర్వులు :

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యా మండలిని పునర్‌ వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలికి విద్యాశాఖ మంత్రి చైర్మన్‌గా, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. కాలేజీ విద్య, ఇంటర్మీడియట్‌ విద్య, పాఠశాల విద్య, సాంకేతిక విద్య ఉపాధి- శిక్షణ శాఖ, తెలుగు అకాడమీ డైరెక్టర్లు, సెకండరీ విద్య బోర్డు కార్యదర్శి, సార్వత్రిక విద్యా పీఠం కార్యదర్శులు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నియమించింది.


అలాగే.. ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి కన్వీనర్‌గా కొనసాగుతారు. ఆంధ్ర, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ, డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీల ఉపకులపతులు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, కేజీబీవీ, రెసిడెన్షియల్‌ కాలేజీలు, మోడల్‌ స్కూల్స్‌, నారాయణ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లను నామినేటెడ్‌ సభ్యులుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button