తెలంగాణ

Uttam: బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేశాం

Uttam Kumar Reddy: టన్నెల్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టన్నెల్‌లో 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయిందన్నారు . దేశంలోని అన్ని బెస్ట్ రెస్క్యూ టీములను రప్పించామన్నారు. గ్యాస్ కట్టర్‌లతో టీబీఎం మెషీన్ భాగాలను తొలగిస్తున్నామని వెల్లడించారు.

వాటర్‌ను బయటకు పంపే క్రమంలో రెస్క్యూ కాస్త ఆలస్యం అవుతుందన్నారు. రెస్క్యూలో పాల్గొన్నవారు రిస్క్‌లో పడకూడదన్న నిర్ణయంతో ముందుకు వెళ్తున్నామన్నారు . టర్నెల్‌లో చిక్కుకున్న వారి ఆచూకీని మరో రెండ్రోజుల్లో తెలుసుకుంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేశామన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడవద్దని ప్రతిపక్షాలకు ఉత్తమ్ సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button