తెలంగాణ
తల్లిని వేధిస్తున్న తండ్రిని హత్య చేసిన కుమార్తె

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన తండ్రిని కుమార్తె హతమార్చింది. తండ్రి తరచూ మద్యం తాగి తల్లిని అనుమానిస్తూ కొడుతున్నాడని గంగమణి ఆగ్రహానికి గురైంది.
దీంతో తండ్రి నిద్రిస్తున్న సమయంలో రోకలిబండతో తలపై మోది హత్య చేసింది. అనంతరం కుమార్తె గంగమణి స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.