సినిమా
బెట్టింగ్ యాప్ కేసులో సినీ, క్రీడా ప్రముఖులను ప్రశ్నించిన ఈడీ

ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లపై దర్యాప్తు మళ్లీ స్పీడప్ అయింది. ఇందులో భాగంగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, నటుడు సోనూసూద్ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తుం ది. కాగా ఇప్పటికే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రైనా, నటి ఊర్వశీ రౌతెలను అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
నిషేధిత బెట్టింగ్ ప్లాట్ఫామ్ల ప్రమోషన్లకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లకు పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ తారలు ప్రచార ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే వారి విచారించినట్లు సమాచారం.