తెలంగాణ

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన బెదిరింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వంగపల్లి గ్రామంలో గ్రానైట్ వ్యాపారి మనోజ్ ఒక క్వారీని నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తమను 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా హన్మకొండ జిల్లా సుబేదారి పోలీసులు పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ కౌశిక్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో బెదిరింపుల కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button