తెలంగాణ
Kishan Reddy: కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటల నిజాలే చెప్పారు

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటల నిజాలే చెప్పారన్నారు. ఈటల రాజేందర్కు తెలిసిందే చెప్పారన్నారు. కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలనే ఈటల చెప్పారన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటానని చెప్పారు.
కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎవరిపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు క్రాక్ అయింది నిజం కాదా అని ప్రశ్నించారు. NDSA రిపోర్టు ఎలా తప్పు అవుతుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.