తెలంగాణ
Thummala: ఈ ఏడాది పంట వేయకముందే రైతు భరోసా ఇస్తాం

Thummala: ఈ ఏడాది పంట వేయకముందే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడు రోజులపాటు జరగనున్న రైతు మహోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు కార్యక్రమానికి ఎడ్లబండ్లపై ఊరేగింపుగా చేరుకున్న మంత్రులకు అధికారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం కార్యక్రమంలో ఏర్పాటుచేసిన 150 కి పైగా స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయ పద్ధతులను రైతులకు తెలియజేయడానికి రైతు మహోత్సవం నిర్వహించినట్లు పొన్నం తెలిపారు. మూడు రోజులు జరుగుతున్న కిసాన్ మేళాకు రావాలని రైతులను కోరారు.