ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సోనూ సూద్

Tirumala: నటుడు సోనూ సూద్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు అయిందని నటుడు సోనూసూద్ అన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రపంచ శ్రేయస్సు కోసం స్వామివారిని ప్రార్థించానని అన్నారు.