తెలంగాణ
MLC Kavitha: కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకోము

MLC Kavitha: కేసీఆర్కు బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకోమన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేసినందుకా కేసీఆర్కు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. జయశంకర్, కేసీఆర్ స్ఫూర్తితో జాగృతి ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా జూన్ 4న ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేపడుతున్నామని కవిత తెలిపారు.
ప్రతి ఉద్యమంలోనూ తెలంగాణ జాగృతి ఉందన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టేనని కవిత అన్నారు. ఆనాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేపట్టకపోతే ఈ రోజు రేవంత్ సీఎం అయ్యేవారు కాదన్నారు.