తెలంగాణ

Madhusudhana Chary: బీఆర్ఎస్, బీజేపీ కలవడం అనేది ఊహాగానాలు మాత్రమే

Madhusudhana Chary: శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని కొందరు అంటున్న కుట్రను ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భావం జరిగిందని, ప్రతికూల పరిస్థితుల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. తెలంగాణ అంటేనే నక్సలైట్లు అనే పరిస్థితుల్లో పార్టీని స్థాపించారన్నారు. కాంగ్రెస్, టీడీపీకి ధీటుగా బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని కొనియాడారు.

ఇద్దరు బలమైన నాయకులు వైఎస్ఆర్, చంద్రబాబును కేసీఆర్ ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్‌ను బలహీనపర్చాలని కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడవని హితవు పలికారు. తెలంగాన సాధించి కేసీఆర్ సీఎం అయ్యి అభివృద్ధి చేశారని మధుసూదనాచారి అన్నారు.

తెలంగాణ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదు. తెలంగాణ ప్రజలు ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుందని, ఎలాంటి నిర్ణయమైనా కేసీఆర్ తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరంపై జూన్ 2 న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button