తెలంగాణ
Eatala Rajendar: బీఆర్ఎస్ను మేమెందుకు విలీనం చేసుకుంటాం

Eatala Rajendar: చిట్చాట్లో ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎవ్వరు కొత్త పార్టీ పెట్టరని అన్నారు. ఎవరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో అర్ధం కావట్లేదని అన్నారు. ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు..డైలీ ఎపిసోడ్ ఉంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.
బీఆర్ఎస్ను మేమెందుకు విలీనం చేసుకుంటామన్నారు. పక్క రాష్ట్రం ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఈటల రాజేందర్ అన్నారు. నక్సలైట్స్ అంశంపై కేసీఆర్ ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని ఈటల విమర్శించారు. ఆపరేషన్ కగార్పై కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదన్నారు.