తెలంగాణ

Raja Singh: పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు బీఆర్‌ఎస్‌లో కలిసిపోతారు.. రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

Raja Singh: రాజకీయం వద్దు ఆధ్యాత్మికమే ముద్దు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భావిస్తున్నారా..? చెత్త రాజకీయాలతో వేగలేనంటూ పాలిటిక్స్ కు దూరం అవ్వాలనుకుంటున్నారా..? రాజాసింగ్ రాజకీయాల పై విరక్తి చెందారా..? అంటే అవున్నట్లే కానిపిస్తున్నాయి ప్రస్తుతుం జరుగుతున్న పరిణామాలు. బీజేపీ యాక్టివిటీ స్ కు అందుకే దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయ్. తాజాగా ఆయన చేసిన హాట్ కామెంట్స్ ఎటు దారితీస్తాయి… ? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ఆయన చేసిన కామెంట్స్‌లో నిజమెంతా..? పొలిటికల్ సర్కిల్ లో ఆఫ్ ద రికార్డ్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది.. ? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై వస్తున్న వార్తల్లో నిజముందని కుండబద్దలు కొట్టారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ వాళ్లు కూడా ఎప్పుడో బీజేపీని బీఆర్‌ఎస్‌లో కలిపేసేవారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒకవేళ బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలని అనుకుంటే ఎక్కడి నుంచి నిలబడాలి అనేది కూడా బీఆర్‌ఎస్ వాళ్లే డిసైడ్ చేస్తారన్నారు. గతంలో కూడా ఇదే జరిగిందని అందుకే బీజేపీ నష్టపోయిందని అన్నారు. ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం రావాల్సి ఉందని కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు.

బీజేపీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌పై మాట్లాడినందుకే అనేక మందిని సస్పెండ్ చేశారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి వచ్చేదన్న రాజాసింగ్.. మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే అధికారంలోకి రాలేకపోయిందన్నారు. ప్రతీ ఎన్నికల్లో తమ పార్టీ నేతల కుమ్మక్కయ్యారని ఆరోపించారు.

దీని వల్ల బీజేపీ చాలా నష్టపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు. తమ వాళ్లు పెద్ద పెద్ద ప్యాకేజీలకు కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకు వెళ్తే సస్పెండ్ చేస్తారనే భయంతో కార్యకర్తలు, అధికారులు నోరు మూసుకుని కూర్చున్నారంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను వాళ్లే డిసైడ్ చేస్తారని అన్నారు. అందుకే తెలంగాణలో బీజేపీ చాలా లాస్ అవుతుందంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు.

అయితే సొంత పార్టీపై విమర్శలు చేయడం రాజాసింగ్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా బీజేపీపై పలు విమర్శలు చేశారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పూర్తి స్థాయిలో అధికారపార్టీకి తొత్తులుగా మారేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నం చేసిందని ఆరోపించారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో చేతులు కలుపుతూ వారికి వంత పాడటం అనేది బీజేపీ రాష్ట్ర నాయకుల్లో కొంతమందికి అలావాటు అయ్యిందని, పాత స్క్రాబ్‌ను తీసివేస్తే తప్ప పరిష్కారం లభించదంటూ గతంలో కూడా రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు.

అలాగే.. సొంత పార్టీ సీనియర్లపైనే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి రావాలంటేపార్టీ నుంచి పాత సామాను వెళ్లిపోవాలన్నారాయన. దీనిపై కేంద్ర పెద్దల కూడా ఆలోచన చేయాలన్నారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనుకునే వాళ్లకి రిటైర్డ్ మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజాసింగ్ తెలిపారు. ఇది తానొక్కడే కాదని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కోరుకుంటున్నాడని వ్యాఖ్యానించారు.

పార్టీలో పాత సరుకు వెళ్లిపోవాలని రాజాసింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు కొందరు అధికార పార్టీతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణను బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా కొందరు పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ చెప్పారు. కాగా కొన్నిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు రాజాసింగ్ దూరంగా ఉంటున్నారు. ఇక రాజాసింగ్ చేసిన తాజా వ్యాఖ్యలతో మరోసారి పార్టీలో చర్చ జరుగుతోంది.

మొత్తానికి రాజాసింగ్ వ్యాఖ్యలు కమలం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజాసింగ్ మున్ముందు ఇంకెలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button