తెలంగాణ
హైదరాబాద్ల్లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు

హైదరాబాద్లో మళ్లీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. మియాపూర్ మైత్రి నగర్ పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. ఎకరా స్థలంలో వెలసిన మట్టి కుప్పలను తొలగించేశారు.
పార్కు స్థలంలో ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగి పార్కు చుట్టూ నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.