Hyderabad: దారుణం.. భర్తను చంపి పూడ్చిపెట్టిన భార్య

Hyderabad: స్కెచ్ వేశారో అస్సలు మిస్ అయ్యే ప్రసక్తే లేదు. అవును ఇటీవల భర్తలను మట్టుపెడుతున్నారు భార్యలు. వాస్తవానికి భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు హైదరాబాద్ కూకట్పల్లిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కవిత అనే మహిళ తన భర్త సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపి పూడ్చిపెట్టింది.
KPHBలో వాచ్మెన్గా పనిచేస్తున్న సాయిలుకు భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాయిలు అనారోగ్యం కారణంగా గడచిన 15ఏళ్లుగా కవిత, సాయిలు వేర్వేరుగా ఉంటున్నారు. అంతేకాదు భార్య, భర్త ఇద్దరికీ వేరువేరు వివాహితర సంబంధాలు కూడా ఉన్నాయి.
అయితే భర్త వేధింపులు భరించలేక ఎలాగైనా సాయిలును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న భార్య కవిత తన చెల్లెలు, చెల్లెలు భర్తను సాయం కోరింది. వారిద్దరు కూడా సహకరించేందుకు ముందుకు వచ్చారు. అనుకున్నట్లుగానే చంపేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.