ఆంధ్ర ప్రదేశ్
Atchannaidu: కడపలో మే 27 నుంచి టీడీపీ మహానాడు

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన పొలిట్ బ్యూరో సమావేశంలో 12అంశాలపై చర్చిoచారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ అమరులకు సంతాపం తెలిపింది. మహానాడు లోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, కమిటీలు పూర్తి చేయాలని నిర్ణయించారు.
మే 27, 28, 29న మూడు రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణకు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో అమరులైన వారికి సంఘీభావం గా ఈనెల 16, 17, 18న తిరంగా ర్యాలీలు నిర్వహిoచాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుందన్నారు.