జాతియం
India-Pakistan: భారత్-పాకిస్తాన్ DGMO స్థాయి చర్చలు వాయిదా

India-Pakistan: భారత్-పాకిస్తాన్ DGMO స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. సాయంత్రం 5గంటలకి భారత్-పాక్ DGMOల చర్చలు జరుగనున్నాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల ఉన్నతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారుల దోవల్ చర్చిస్తున్నారు.
దాదాపు గంటన్నరసేపుగా ఈ భేటీ కొనసాగుతోంది. భారత్-పాక్ చర్చల నేపథ్యంలో ప్రధాని మోదీ, దోవల్ పలు అంశాలపై దృష్టి సారించారు. ఇక కాసేపట్లో ఆపరేషన్ సిందూర్పై మిలటరీ అధికారులు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు.