Operation Sindoor: కష్టాల్లో పాకిస్థాన్.. నీళ్లు కట్, పిండి ధర రూ.600..

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ కఠిన చర్యలు చేపట్టింది. దీంతో పాకిస్తాన్ను కష్టాలు చుట్టుముట్టాయి. ఆర్థిక సమస్యలు కూడా వెంటాడటంతో పాక్ విలవిలలాడుతోంది. అంతేకాదు ప్రస్తుతం పాకిస్తాన్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతోన్నాయి.
చెప్పాలంటే పాకిస్తాన్లో యుద్ధం ప్రారంభంకాకముందు 5కిలోల పిండి 610రూపాయలు. ఇప్పుడు కేవలం కిలోపిండి 600 రూపాయలు పలుకుతోంది. చికెన్ ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్లో చికెన్ ధర ఏకంగా పదకొండు వందల రూపాయలు. దీంతో ఏమి కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదంటున్నారు పాకిస్తానీయులు. ఎవడి కోసం యుద్ధం చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఇక పాకిస్తాన్లో కోళ్ల దాణాకు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. అయితే పాకిస్తానీయులు మాత్రం తమకే తినడానికి తిండి లేదని కోళ్లకు దాణా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటున్నారు. మరోవైపు పాక్ను ఆర్థికంగా దెబ్బతీస్తోంది భారత్. దీంతో పేదరికంలోకి పడిపోతుంది పాకిస్తాన్. ఇప్పటికే పాక్కు నీళ్లు నిలిపివేశారు. ఇక నీటి సరఫరా లేకపోవడంతో కరువు పరిస్థితులు దాపరించాయి.
సింధు జల ఒప్పందం రద్దు తర్వాత.. వాణిజ్యాన్ని నిలిపివేసింది భారత్. వార్ నేపథ్యంలో దళాలను మోహరించడం విమానాలకు ఇంధనం కోసం దాదాపు 13 మిలియన్ల డాలర్ల ఖర్చు చేస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ కఠిన చర్యలు చేపట్టడంతో పాకిస్తానీయుల ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. కాగా.. ఇప్పటికే పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.