Gold Rate: భగ్గుమన్న బంగారం ధర… లక్షకు చేరువలో..

Gold Rate: బంగారం ధరలు భగభగ మంటున్నాయి. ప్రస్తుతం పసిడి ధరలు.. పరుగులు పెట్టడం లేదు. తగ్గేదే లే అన్నట్లుగా ధరలు అంతకంతకు పెరిగిపోతుంది. రన్ రాజా రన్ అంటున్నట్టూ ఈ ఏడాది ప్రథమార్థంలోనే లక్ష రూపాయల మార్క్ టచ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక పసిడి ఇదే జోరును కొనసాగిస్తే మధ్య తరగతి జనం బంగారం కొనడం కష్టమే అని చెప్పొ చ్చు.
చెప్పాలంటే.. పగ్గాలే లేనట్టుగా బంగారం ధర పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా ట్రంఫ్ ఎఫెక్ట్.. దేశీయంగా రూపీ పతనంతో గోల్డ్ రేట్ కొత్త రికార్డులను తాకుతోంది. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే గనుక.. తొలం బంగారం ధర లక్ష రూపాయలకు చేరే రోజు ఎంతో దూరం లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రధానంగా ట్రేడ్వార్ కారణంగా స్టాక్మార్కట్లలో అనిశ్చితి కనిపిస్తోంది. దీని కారణంగానే బంగారం ధర స్పీడు పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి బంగారం ధరలు వరుసగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్లు ఇస్తున్నాయి. తాజాగా ఆల్టైమ్ రికార్డ్ ధరకు చేరింది బంగారం ధర. 10 గ్రాముల బంగారం ధర 87వేలకు పెరిగింది. అవును.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 87వేల రూపాయల దగ్గర ట్రేడవుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 80వేల 560 రూపాయలుగా ఉంది. ఇక వెండి కూడా తగ్గేదే లే అంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 98వేల రూపాయలకు పెరిగింది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పాలసీలు మార్చడంతో.. గ్లోబల్ ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. స్టాక్మార్కెట్లో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని గోల్డ్ కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు. ఆర్బీఐతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్లు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా పసిడి రేట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి. యుద్ధ భయాలు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. చాలామంది స్టాక్మార్కెట్లు అంత సేఫ్ కాదన్న అంచనాతో ఉన్నారు. దీంతో బంగారంపైనే భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫైనల్గా పసిడి ధర ఆల్ టైమ్ రికార్డ్ వైపుగా దూసుకెళ్తోంది. అతి త్వరలో లక్ష రూపాయల మార్క్ను టచ్ చేయడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి గోల్డ్ అన్స్టాపబుల్ మార్కెట్ స్పీడ్కి మధ్య తరగతి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం ధరలు పెరగడం తప్పితే.. తగ్గే అవకాశాలే కనిపించడం లేదు.