తెలంగాణ కాంగ్రెస్కు మరో తలనొప్పి..!

తెలంగాణ కాంగ్రెస్కు మరో తలనొప్పి మొదలయ్యిందా..? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. ముఖ్యంగా పార్టీకి.. కొత్తగా ఫిరాయింపు ఎమ్మెల్యేల గుబులు మొదలయ్యింది. ఈ క్రమంలోనే సీఎల్పీ మీటింగ్ నిర్వహించగా.. పార్టీ ఫిరాయింపుదారులు సమావేశానికి డుమ్మా కొట్టారు. అయితే ప్రస్తుతం సుప్రీంలో కేసు పెండింగ్ ఉన్నందునే హాజరుకాలేదంటున్నారు ఫిరాయింపుదారులు. మరోవైపు లీగల్గా సమస్యలు రాకుండా ఉండేందుకే రావొద్దని కాంగ్రెస్ పెద్దలే చెప్పారని టాక్ వినబడుతోంది. ఇప్పటికే పార్టీ ఫిరాయించడంపై లిఖిత పూర్వక స మాధానం ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ, మరోవైపు సుప్రీంకోర్టు కోరింది.
ఈ విషయంలోనే ఫిరాయింపుదారలు తర్జనభర్జన పడుతున్నారు. మరోవైపు ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండటంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ తీసుకునే నిర్ణయమేంటని ప్రశ్నార్థకంగా మారింది. అటు ఫిరాయింపుదారులు వాట్ నెక్ట్స్ అని ఆలోచిస్తున్నారు. ఇటు ఫిరాయింపుదారుల ను భవిష్యత్తులో కూడా అక్కున చేర్చుకోమంటోంది బీఆర్ఎస్. మొత్తానికి పార్టీ మారిన ఫిరాయింపుదారులకు కష్టకాలం తప్పదా? అంటే కాలమే చెబుతోందంటున్నారు విశ్లేషకులు.