ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఈనెల 27న పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించనున్న చంద్రబాబు

Chandrababu: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనెల 27న పోలవరం ప్రాజెక్ట్ను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంపై చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ఏలూరు కలెక్టర్ పరిశీలించారు. పోలవరం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.