ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని మోహన్బాబుపై ఫిర్యాదు..

AP News: వాగులు, వంకలు, స్థలాలు ఆక్రమించి చేపడుతున్న మోహన్బాబు విద్యానికేతన్ కళాశాల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ప్రజాసంకల్ప వేదిక ఉపాధ్యక్షుడు చెంగల్ రాయల్ డిమాండ్ చేశారు. విద్యానికేతన్ సంస్థను అడ్డుపెట్టుకుని మోహన్బాబు చంద్రగిరి మండలం నాలుగు రెవెన్యూ గ్రామాల కూడలి చుట్టూ ఉన్న వాగుకుంట, పోరంబోకు స్థలాలను ఆక్రమించి ప్రహారీ నిర్మిస్తున్నారని ఆరోపించారు. హాస్టల్లలోని మురికినీరు, పొలాల్లో ఉండే మురికి నీటిని శుద్ధిచేస్తానన్నారు.
ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం తన ఖర్చులతో భరిస్తానని అప్పటి కలెక్టర్ను మభ్యపెట్టి మోహన్ బాబు అక్రమ నిర్మాణాలకు అనుమతులు పొందారన్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే హైకోర్టులో పిటీషన్ వేశానన్నారు. అక్రమాలను అడ్డుకునేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు.