జాతియం
Ola-Uber: ఉబర్, ఓలా సంస్థలకు కేంద్రం నోటీసులు

Ola-Ubber: యాప్ ఆధారంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్ ఓలా సంస్థలపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ స్పందించింది. ఈ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల ఫిర్యాదుల ప్రకారం, ఈ యాప్లు ఫోన్ మోడల్ను బట్టి ఛార్జీలను నిర్ణయిస్తున్నాయన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లతో పాటు, ఫోన్ ధర ఆధారంగా కూడా ఛార్జీల్లో మార్పులు ఉన్నాయని పలువురు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ఈ ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఉబర్, ఓలా సంస్థలను కేంద్రం ఆదేశించింది. ఒకే సర్వీసుకు రెండు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.