తెలంగాణ
Miss World 2025: రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న సుందరీమణులు

Miss World 2025: 72వ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన సుందరీమణులు ఈనెల 14న ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారని ములుగు జిల్లా కలెక్టర్ టి.ఎస్.దివాకర ఒక ప్రకటనలో తెలిపారు.
👉 14 న హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ములుగులోని హరిత హోటల్ కు చేరుకుంటారు.
👉4:30 కి సాంప్రదాయ వస్త్రాల్లో రామప్ప దేవాలయ దర్శనం చేసుకుంటారు.
👉 5:00 గంటలకు దేవాలయ ప్రాంగణంలో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు.