తెలంగాణ

SLBC Tunnel: 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 15వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

SLBC Tunnel: SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ వద్దకు చేరుకున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ. ప్రస్తుతం టెన్నెల్ వద్ద రెస్క్యూ పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్, రెస్క్యూ టీమ్స్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. నేటితో 15వ రోజులు కావడంతో పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులతో మాట్లాడి పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

నిన్న కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రాలేదు. అయితే ఇవాళ అందుబాటులోకి రావడంతో కన్వేయర్ బెల్ట్‌పై మట్టిని బయటకు తరలిస్తోంది సిబ్బంది. ఫిబ్రవరి 22 ఉదయం 8గంటల 30నిమిషాలకు టన్నెల్‌లో ప్రమాదం జరగ్గా 15 రోజులు గడిచినా కూడా చిక్కుకున్న 8 మంది ఆచూకీ దొరకడం లేదు. అయితే రెస్క్యూ పూర్తి అయ్యేందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందంటోంది రెస్క్యూ సిబ్బంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button