ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటాను

Chandrababu: ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు. నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటానని అన్నారు.
సాంకేతికత ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందన్నారు. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారని అన్నారు. నా ఆలోచన ఒకటే. మనం బాగుంటేనే చాలదు.. తిరిగి సమాజానికి ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. విజయవాడలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్కు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.