తెలంగాణ
నేడు రెండు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటన

నేడు రెండు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు చేస్తారు. మక్తల్, ఆత్మకూరులో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి, జూరాల దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు.



