తెలంగాణ

Eatala Rajender: కాళేశ్వరానికి బాస్‌ కేసీఆరే.. నిర్ణయం తీసుకుంది ఆయనే

Eatala Rajender: కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. 25ఏళ్ల రాజకీయ జీవితంలో నైతిక విలువలతో ఉన్నానన్న ఈటల.. తెలంగాణకు మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేశానన్నారు. 2016లో తుమ్మడిహట్టి ప్రాజెక్టు అంచనా 16వేల కోట్లు ఉండగా ఆ తర్వాత రూ.38వేల కోట్లకు పెంచారని ఈటల వెల్లడించారు.

కాళేశ్వరానికి మొదట్లో 63వేల కోట్లు అంచనా వేయగాఆ తర్వాత 83వేల కోట్లకు పెరిగిందన్నారు. తుమ్మిడిహట్టి ద్వారా నీటి అవసరాలు తీరవని రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు. ప్రత్యామ్నాయం చూడాలని ప్రభుత్వం కోరడంతో కాళేశ్వరం ఎంపిక చేసినట్టు చెప్పారు. చివరికి ఎంతైందో తనకు తెలియదన్నారు.

కాళేశ్వరం విలువ, ఖర్చుతో ఆర్థిక శాఖకు సంబంధం లేదని కామెంట్ చేశారు. అన్ని విషయాలు ఇరిగేషన్ శాఖతో పాటు కాళేశ్వరం కార్పొరేషన్‌తోనే ముడిపడి ఉన్నాయని స్పష్టం చేశారు ఈటల. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తాను కట్టానని కేసీఆరే చాలాసార్లు వేదికలపై చెప్పుకున్నారని అన్నారు. కేబినెట్‌కు బాస్ కేసీఆర్ అని నిర్ణయం తీసుకుంది ఆయనేనని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ వాస్తవ రిపోర్టులను బయటపెట్టాలని అన్నారు. ఎంత నష్టం జరిగిందో ఎవరు బాధ్యులో ప్రభుత్వమే చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button