ఆంధ్ర ప్రదేశ్
Kollu Ravindra: మచిలీపట్నంను గ్రీన్ సిటీగా మారుస్తాం

Kollu Ravindra: మచిలీపట్నంను గ్రీన్ సిటీగా మారుస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బందరుకోట రోడ్డులో పాత రైల్వే స్టేషన్ దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు టీ గార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో 50 శాతం పచ్చదనం పెంచేందుకు ప్రణాళికలు తయారు చేసి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి రవీంద్ర తెలిపారు.