ఆంధ్ర ప్రదేశ్
నంద్యాల జిల్లా బనగానపల్లెలో పేకాట రాయుళ్లు అరెస్ట్

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నందవరంలో పేకాట శిభిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఆలయానికి వచ్చిన వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు ఒక ముఠాగా ఏర్పడి పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిపై పక్క సమాచారం తెలుసుకున్న పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసారు.
తొగట వీర క్షత్రియ సత్రం పక్కన ఉన్న చెట్ల క్రింద జమ్మలమడుగు, ప్రొద్దుటూరు , బనగానపల్లె, సంజామలకు చెందిన సుమారు 22 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుండి 5.50 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.