తెలంగాణ
MLC Kavitha: ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదు

MLC Kavitha: SLBC ప్రమాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది ప్రాణాలు SLBC సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే కాంగ్రెస్ నాయకులు పార్టీ సమావేశానికి వెళ్లారని కవిత మండిపడ్డారు. సంఘటనా స్థలం వద్ద ఒక్క మంత్రి కూడా లేరంటే ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో SLBC టన్నెల్ను 11 కిలో మీటర్లు తవ్వినప్పుడు ఒక్క ప్రమాదం కూడా జరగలేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.