తెలంగాణ
MLC Election: కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణలో మూడు MLC స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి తెలంగాణలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి పోలింగ్ జరుగుతోంది.
ఏపీలో మూడు MLC స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 MLC స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది.