తెలంగాణ
ఈఈ నూనె శ్రీధర్ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ

కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈఈ నూనె శ్రీధర్ను 5 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని ఐదురోజుల పాటు శ్రీధర్ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నూనె శ్రీధర్ కీలకంగా పనిచేశారు. అయితే ఆయన ఇళ్లు, బంధువుల నివాసాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు సుమారు 150 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తించారు.