ఆంధ్ర ప్రదేశ్
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు

కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు చేశారు. గుంటూరు నగర పాలక సంస్థలో 3న జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ ఎన్నికల్లో.. 12 మంది పాల్గొంటే.. వారిలో ఆరుగురు కూటమి పార్టీ అభ్యర్ధులే అత్యధిక ఓట్లతో గెలుపొందారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మొత్తం 56 కార్పొరేటర్ల్ ఉండగా.. ఎన్నికల ముందు టీడీపీకి 11 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.
స్టాండింగ్ కమిటీ ఎన్నికల ముందు వైసీపీకి చెందినవారు ఐదుగురిని భయభ్రాంతులకు గురిచేశారని .. కూటమి వైపు లాక్కున్నారని అంబటి ఆరోపించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉండాల్సిందిపోయి టీడీపీకి వెళ్లడం ఎంతవరకు సమంజసం అని వైసీపీ నాయకులు ప్రశ్నించారు అంబటి .