జాతియం
Delhi: ఢిల్లీని కప్పేసిన మంచు దుప్పటి.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం..

Delhi: ఉత్తర భారతాన్ని చలి వణుకుపుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. చలికి అల్లాడిపోతున్నారు. జలాశయాలు గడ్డకట్టుకుపోయాయి. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, రాజస్థాన్లలో ఉష్ణోగ్రతలు దిగువకు పడిపోయాయి. పంజాబ్, హర్యానాల్లోనూ శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పేసింది.
తెల్లవారుజామాను 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచు దట్టంగా కురుస్తూ.. 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. వాయు నాణ్యతా సూచీ 334గా నమోదైంది.