తెలంగాణ
లావణ్యతో నార్సింగి డీఐ శ్రీనివాస్ వీడియో కాల్స్
నార్సింగి డీఐ శ్రీనివాస్ను సైబరాబాద్ సీపీ ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. లావణ్యతో తరచూ వాట్సాప్లో వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడుతూ శ్రీనివాస్ పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపారు.
విచారణలో శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది నిజమే అని తేలడంతో అతనిని ఐజీ ఆఫీసుకు అటాచ్ చేశారు. లావణ్య నటుడు రాజ్ తరుణ్పై పిర్యాదు చేసినప్పటి నుంచి శ్రీనివాస్తో ఆమె పరిచయం పెరిగింది. తరచూ ఇద్దరూ ఫోన్లో వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడుతున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సైబరాబాద్ సీపీ శ్రీనివాస్పై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.