జాతియం

నేడు కేంద్ర కేబినెట్ భేటీ.. మోదీ అధ్యక్షతన సమావేశం

నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 6గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా యూఎస్‌కు అక్రమవలసల ఇష్యూపై చర్చించనున్నారు. భారత్ నుంచి అమెరికాకు అక్రమ మార్గంలో వెళ్లిన వారిని ట్రంప్ సర్కార్ గెంటేస్తుంది. చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి మరీ ఇండియాకు తరలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు కన్నెర్ర చేస్తున్నాయి. సంకెళ్లు వేసి తరలించడం ఎంతవరకు కరెక్టో చెప్పాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అప్ కీ బార్ ట్రంప్ అన్న మోదీయే ఇందుకు సమాధానం చెప్పాలంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ మేరకు వలసదారుల భద్రతకు కొత్తచట్టం తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. వలసలను క్రమబద్దీకరించేలా చట్టం తీసుకువచ్చే అవకాశం కన్పిస్తోంది. ముఖ్యంగా విదేశాలకు వలసవెళ్లే వారి భద్రతకు ఉపయోగపడేలా చట్టం తీసుకురానున్నట్లు తెలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button