ఆంధ్ర ప్రదేశ్
Tirumala: రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు

Tirumala: రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. అయితే సెకండ్ల వ్యవధిలోనే కారు పూర్తిగా దగ్ధం అయింది. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఘటన చోటుచేసుకుంది.