ఆంధ్ర ప్రదేశ్
East Godavari: అప్పుల బాధ తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

East Godavari: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి రెండోవ అంతస్తు నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కాగా.. అప్పుల బాధ తట్టుకోలేక ఎలుకల మందు తాగి వాసిరెడ్డి వరలక్ష్మీ అనే మహిళ నిన్న ఆత్మహత్యాయత్నం చేసింది.
గమనించిన బంధువులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ… తిరిగి ఆస్పత్రి రెండోవ అంతస్తుపై నుంచి కిందకి దూకి చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.