తెలంగాణ

Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ

Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషి భేష్ అన్నారు. ధూప-దీప నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను ఆదుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. కరీంనగర్‌లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించండంటూ బండి కోరారు.

2023లోనే కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని అదే ఏడాది మే 31న కరీంనగర్ లోని 10 ఎకరాల స్థలంలో భూమి పూజ జరిగినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం కరీంగనర్ సహా పొరుగు జిల్లాల ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి లేఖలో ప్రస్తావించారు. యుద్ధ ప్రాతిపదికన కొనసాగించేలా టీటీడీ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button