తెలంగాణ
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

Ponguleti: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తున్నామని మిగతా వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.