ఆంధ్ర ప్రదేశ్
Satavahana College: ముదిరిన వివాదం..శాతవాహన కాలేజీ కూల్చివేత

Satavahana College: విజయవాడలో శాతవాహన కాలేజీ వద్ద ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శాతవాహన కాలేజీ భవనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్తో ఈ వివాదం మరింత ముదిరినట్లు సమాచారం. అదేవిధంగా కాలేజీ భవన స్థలంలో బోయపాటి శ్రీనివాస్ అప్పారావు పేరిట బోర్డులు వెలిశాయి.
పొక్లెయిన్లతో కాలేజీ భవనాల కూల్చివేత జరుగుతుండగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకున్నారు పోలీసులు. శిథిలాల కిందే విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉండటంతో ఎస్ఎఫ్ఐ విద్యార్థు సంఘం నాయకులు మండిపడ్డారు.