ఆంధ్ర ప్రదేశ్
పీఎస్ఆర్ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

PSR Anjaneyulu: పీఎస్ఆర్ ఆంజనేయులు బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు విచారించనుంది. ఇందులో భాగంగా సీఐడీ అధికారులు బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ముంబై నటి జత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కాగా ఇప్పటికే ఈ కేసులో కోర్టు అనుమతితో మూడ్రోజుల కస్టడీలో భాగంగా రెండ్రోజులపాటు ఏసీబీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును విచారించి పలు అంశాలపై సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తుంది. అయితే తొలిరోజు అనారోగ్య సమస్యల కారణంగా పోలీసులు విచారించలేదు.