తెలంగాణ

ఒక న్యూఇయర్ గిఫ్ట్, ఒక సంక్రాంతి కానుక.. కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇక పండగే పండుగ..!

Telangana Govt Sankranti Gift: తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్.. న్యూఇయర్, సంక్రాంతి పండుగకు అదిరిపోయే కానుకలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ మంత్రి వర్గ సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే చెప్తూ వస్తున్నట్టుగా సంక్రాంతికే అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా అమలు చేసేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. భూమిలేని నిరుపేదల ఖాతాల్లోకి డబ్బులు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Telangana Cabinet Decisions: తెలంగాణ వాసులకు న్యూఇయర్‌తో పాటు సంక్రాంతి పండుగకు కానుకలు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఐదు గంటలకు పైగా జరిగిన కేబినెట్ సమావేశంలో.. ఐదు ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. ముఖ్యంగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వటంపై చర్చించిన కేబినెట్.. కీలక నిర్ణయం తీసుకుంది. గతకొంతకాలంగా చెప్తూ వస్తున్నట్టుగానే.. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి పండుగకు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

మరోవైపు.. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అయిన భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పిన హామీని కూడా అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్‌ 28న భూమిలేని నిరుపేదలకు మొదటి విడతగా రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. డిసెంబర్ 28న నిరుపేద అకౌంట్లలోకి రూ.6 వేలు జమ చేయనున్నట్టు కేబినెట్ నిర్ణయిచింది.

మరోవైపు.. తెలంగాణ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు.. మంత్రివర్గం నిర్ణయించింది.

మరోవైపు.. ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. కేటీఆర్‌ ఈ-ఫార్ములా రేస్‌ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణకు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్‌ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని సర్కార్ పేర్కొంది. ఈ క్రమంలోనే.. ఏసీబీకి లేఖ పంపాలని సీఎస్ శాంతి కుమారికి కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.

ఇదే క్రమంలో.. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేసింగ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ బాంబు పేలుతుందన్నది కేటీఆర్‌కు త్వరలోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయటం గురించి తనకు తెలియదని తెలిపారు. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందనడం వారి అహంకారపురిత మాటలకు నిదర్శనమని పొంగులేటి తెలిపారు. ప్రతిపక్షంగా విమర్శలు చేయడంలో తప్పు లేదన్నారు మంత్రి. కక్ష పూరితంగా కాంగ్రెస్ వ్యవహరించడం లేదని క్లారిటీ ఇచ్చిన మంత్రి.. తప్పులను బయటకు తీసి చర్చలో పెట్టామని పేర్కొన్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై కూడా చర్యలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button