ఆంధ్ర ప్రదేశ్
Botsa Satyanarayana: పోలవరం ఎత్తు తగ్గించడానికి వీలు లేదు

Botsa Satyanarayana: కూటమి సర్కార్పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులతో వీసీలను రాజీనామాలు చేయించడం విద్యా వ్యవస్థకు కళంకమని ఎమ్మెల్సీ బొత్స విమర్శించారు. వీసీలుగా క్వాలిఫైడ్ వాళ్ళను మాత్రమే నియమిస్తారని దానికి ఒక కమిటి ఉందని తెలిపారు.
పోలవరం ఎత్తు తగ్గించడానికి వీలు లేదన్నారు. ఎత్తు తగ్గిస్తే పవర్ ప్లాంట్ రాదని ఉత్తరాంధ్ర, రాయలసీమకి నీళ్లు రావని తెలిపారు. పోలవరంపై ఎత్తు తగ్గింపు అంశాల్లో కూడా ప్రభుత్వం స్వస్థత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.



