జాతియం
కావలి చేరుకున్న మధుసూదన్ భౌతికకాయం

పహల్గామ్ ఉగ్రదాడిలో మృతిచెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మధుసూదన్ భౌతికకాయం కావలికి చేరుకుంది. మధుసూదన్ భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీ రు అవుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ వెల్లడించారు. ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు చెన్నై ఎయిర్పోర్టులో మధుసూదన్ భౌతికకాయానికి అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు.