ఆంధ్ర ప్రదేశ్
YS Sharmila: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఫెయిల్

YS Sharmila: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఫెయిల్ అయిందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అందరికీ తల్లికి వందనం అమలు కావాలన్నారామె. 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 63 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారని ఇది ఎంతవరకు కరెక్ట్ అని షర్మిల ప్రశ్నించారు. రైతు భరోసా కూడా అమలు చేయలేదని షర్మిల ఆరోపించారు. మూడు సిలిండర్ల పథకం కూడా ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదన్నారు. వాయిదాలు వేసుకుంటూ పోతే ఏ పథకం కూడా సక్రమంగా అమలు కాదన్నారామె.