ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

Tirumala: జగతికి వెలుగులు పంచే దినకరుడి పండుగ.. రథసప్తమి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి తిరుమాడవీధుల్లో ఊరేగుతున్నారు.
సూర్యకిరణాలు తాకిన వెంటనే వాహన సేవలు ప్రారంభం కాగా వేంకటేశ్వరుడి నామస్మరణతో ఏడుకొండలు మారు మ్రోగుతున్నాయి. అటు రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఆలయ అధికారలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.