తెలంగాణ
పొంగులేటి, సీతక్కకు నిరసన సెగ

భూభారతి రెవెన్యూ సదస్సు వద్ద హైటెన్షన్ నెలకొంది. అంతేకాదు కాంగ్రెస్ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గ్యో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.మంత్రులను అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.