తెలంగాణ
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో ముందడుగు

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరో ముందడుగు పడింది. మొదటి దశ ఆర్ధిక సహాయానికి నిధులు సిద్ధం చేసింది ప్రభుత్వం. హడ్కో నుంచి 3వేల కోట్ల రూపాయలు రుణం మంజూరయింది. దీంతో బేస్ మెంట్ పూర్తి చేసిన వారికి కాంగ్రెస్ సర్కార్ త్వరలో ఆర్ధిక సాయం అందించనుంది. మొదటి దశ కింద లక్ష రూపాయల చొప్పున సాయం అందించనుంది ప్రభుత్వం.