జాతియం
Bomb Threat: ఢిల్లీ స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు.. బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు

Bomb Threat: ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపులు మొదలయ్యాయి. తెల్లవారుజామున ఎన్సీఆర్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు స్కూళ్లకు చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్ కూడా స్కూల్లో ప్రతీ తరగతి గదని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. కొన్నిరోజులుగా ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వ చ్చాయి.
అయితే దీనిని సీరియస్గా తీసుకున్న అధికారులు.. ఇటీవల ఓ విద్యార్థి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. పరీక్షలు రద్దు చేయాలనే ఉద్దేశంతోనే బెదిరించినట్లు నిర్ధార ణకు వచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేగుతోంది.